telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రాష్ట్ర ప్రజలు కుటుంబ పాలనపై అసంతృప్తిగా ఉన్నారు…

Kishan Reddy

జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఈ రోజు వరంగల్ పర్యటన కేవలం భద్రకాళి అమ్మవారి దర్శనం కోసమే.. వరంగల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సందర్శిస్తా అని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారు అది దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికలు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయిఅని చెప్పిన ఆయన రాష్ట్ర ప్రజలు కుటుంబ పాలన అవినీతి పాలనపై అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో  తెలంగాణ ప్రజల ఆకాంక్ష,ఉద్యమ కారుల ఆకాంక్ష బీజేపీ నెరవేరుస్తుంది అని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన అద్భుతమైన పాలన బీజేపీ అందిస్తుంది. కావాలని పనికట్టుకుని కొన్ని  రాజకీయ  పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. రైతు వ్యవసాయ చట్టంలో  ఏ ఒక్క అంశం కూడా రైతులకు వ్యతిరేకంగా లేదు. దేశవ్యాప్తంగా పంజాబ్ లో తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు. శరద్ జోషి ,స్వామినాథన్, వ్యవసాయ శాస్త్ర వేత్తలు,మేధావులు వ్యవసాయ బిల్లుకు మద్దతు పలికారు అని అన్నారు.

Related posts