telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆల్ దీ బెస్ట్ .. టీమిండియా కు హేమామాలిని విషెస్

Hemamalini mp BJP

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్ లో ఈ రోజు కివీస్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఆ మ్యాచ్‌కు టీమిండియా కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ హేమామాలిని .. ఇండియ‌న్ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. టీమిండియా పేయ‌ర్లు స్మార్ట్‌గా ఆడుతున్నార‌ని, కివీస్‌తో మ్యాచ్‌లో గెల‌వాల‌ని ఆమె బెస్ట్ విషెస్ చెప్పారు. కోహ్లీసేన ఉత్త‌మ ఆట‌ను ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ తీసుకువ‌స్తార‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియాలో కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ జట్టులోకి రాగా, న్యూజిలాండ్ జట్టులో సౌథీ బదులు లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చాడు.

Related posts