యాదాద్రి ఆలయంలోని స్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తులను చెక్కడంపై విపక్షాలు ప్రభుత్వం పై మండిపడుతున్నాయి. ఈ విషయం పై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. పవిత్రమైన యాదాద్రి ఆలయంలోని స్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తులను చెక్కడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయంలో చేసిన తప్పుకు యాదాద్రిలో కేసీఆర్ పొర్లు దండాలు పెట్టాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజం పట్ల కేసీఆర్ కి చులకన భావం ఉందని చెప్పారు. యాదాద్రి కేంద్రంగా రాజకీయ ప్రచారం చేసుకోవడం దారుణమని అన్నారు. హిందూ దేవాలయాన్ని కేసీఆర్ అపవిత్రం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.