ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు 17 కేసుల్లో స్టే తెచ్చుకుని తిరుగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ స్టే తెచ్చుకుని తిరుగుతూ ఇతరులపై నిందలు వేయడం చంద్రబాబుకే సాధ్యమని ఆయన అన్నారు.
ఓటమి భయంతోనే చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అన్ని శాఖలపై సమీక్షలు చేస్తున్న చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధరపై ఎందుకు రివ్యూ నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఆర్థిక మందగమనం భారత్ కు పెద్ద సమస్యగా మారనుంది: మాయావతి