telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొన్న జరిగిన ముందస్తు ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ సందర్భంగా కేటీఆర్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. ఈ సభ నేపథ్యంలో విద్యార్థులతో టీఆర్ఎస్ జెండాలను మోయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు తన ఫిర్యాదును ఫ్యాక్స్ ద్వారా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈసీకి పంపించారు.

Related posts