telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ బొమ్మ తొలగించకపోతే హిందూవాదులతో కలసి ఆందోళన: రాజాసింగ్

BJP-MLA Raja-Singh

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ బొమ్మ చెక్కడం పై విపక్షాలు ప్రభుత్వం పై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నేడు యాదాద్రి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావితరాలకు తెలియజేసేలా నాయకుల బొమ్మలను చెక్కినవారు, వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా? అని నిలదీశారు.

యాదాద్రిని సొంత సొమ్ముతో కడుతున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నామని చెప్పారు. ఈలోగా బొమ్మలను తొలగించకపోతే హిందూవాదులతో కలసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Related posts