telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కేసీఆర్, జగన్ .. బీజేపీ టీం .. తేల్చేసిన : పీయూష్ గోయల్

huge recruitment notification in indian railways

ఎప్పటి నుండో బీజేపీకి కేసీఆర్, జగన్‌ లు లోపాయకారిగా మద్దతు తెలుపుతున్నారన్న వార్తలు నిజమని వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తుగా బీజేపీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ విషయంపై స్పందించారు. ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్, జగన్ ఇద్దరూ తమకు మిత్రులేనని, వారు తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కలయిక విషయంలో అదృష్టవశాత్తు ఎటువంటి జీఎస్టీ ఉండదని చమత్కరించారు.

బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే 300 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తాను దేవాలయాలను సందర్శించబోనని రాహుల్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. కాగా, పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీలు.. బీజేపీ-బి టీములంటూ అంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేలా మంత్రి వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.

Related posts