ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాలుమోపారు. అయితే, బీజేపీ అధినాయకత్వంలో నంబర్.3 గా వెలుగొందుతున్న రాజ్ నాథ్ కు అవనిగడ్డలో నిరాశ తప్పలేదు. ఆయన సభ జనంలేక వెలవెల పోయింది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో బీజేపీ అగ్రనేత చెప్పే మాటలు వినడానికి ఎవరూ ఆసక్తిచూపించలేదు.
తన సభలో ఆద్యంతం టీడీపీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్. ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజల కళ్లల్లో మట్టికొట్టిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని తెలిపారు. అంతకముందు ఆయన తెలంగాణలోని నిజామాబాద్ సభలో పాల్గొన్నారు.
ఛార్మి నా స్టూడెంటే కాని.. నన్ను పిచ్చోడిలా చూసింది.. : రాకేష్ మాస్టర్