telugu navyamedia
సినిమా వార్తలు

ద్రౌప‌తి ముర్ముపై అనుచిత ట్వీట్‌..రామ్‌గోపాల్ వర్మపై బీజేపీ ఆగ్రహం

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో క‌నిపించ‌డం రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కి అలవాటైపోయింది. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు వర్మ. ఈ సారి ఏకంగా ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా… ‘ద్రౌపది రాష్ట్రపతి ‘ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ద్రౌపతి ముర్మును కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో బీజేపీ నేతలు పేర్కొన్నారు.

రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కోరారు. మ‌హిళ ప‌ట్ల అనుచిత కామెంట్లు చేసిన వ‌ర్మపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అబిడ్స్ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు

Related posts