ఏపీ సీఎం చంద్రబాబు గత మూడు రోజులుగా ఢిల్లీలో పలువురు విపక్షనేతలను కలుస్తూ బిజి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ భవన్లో చంద్రబాబును కలిసేందుకు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వచ్చారు. అయితే తాను సీఎంను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని వివరించారు.
చంద్రబాబును కలవడం వెనుక ఎటువంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.కాగా ఎన్డీయేతర పక్షాలను ఏకం చేయడంలో, అలాగే ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఈ నేపథ్యంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో చంద్రబాబు భేటీ కానున్నారు.