telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీలో చేరడానికి మైనారిటీల ఆసక్తి: కె. లక్ష్మణ్

మహిళలు, మైనారిటీలు భారీగా బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల్లో ఆదరణ చాలా బాగుందని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వాన్ని చేసుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ నమోదుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, సభ్యత్వ నమోదు బాధ్యులు శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని చూస్తోందని ఆరోపించారు. అయినా సరే బీజేపీ సర్వసన్నద్ధంగా ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి రాష్ట్రంలోని అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు.

Related posts