telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భద్రాచలం విషయంలో మీ స్టాండ్ ఏంటో చెప్పాలి: లక్ష్మణ్

laxman kasetty

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు.ఇద్దరి కలయిక మంచి పరిణామమేనని కొనియాడారు . ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతకు సంబంధించి ఈ సోయి అప్పుడేందుకు లేదని కేసీఆర్ పై మండిపడ్డారు. గతంలో కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలపై టీఆర్ఎస్ నేతలు గతంలో కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. భద్రాచలం విషయంలో మీ స్టాండ్ ఏంటో చెప్పాలని నిలదీశారు.

గతంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పిన మీరు ఇప్పుడెలా న్యాయ జరుగుతుందో చెప్పాలి అని నిలదీశారు. ఇప్పుడేమో రెండు రాష్ట్రాలు వేర్వేరు కాదంటున్నారని విమర్శించారు. గతంలో ప్రజల బాగోగుల గురించి ధ్యాస ఎందుకు లేదని కేసీఆర్ ను కడిగిపారేశారు. పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడుపై మీరు మాట్లాడిన మాటలకు సమాధానం దొరికిందా అని నిలదీశారు. ఇకపోతే

Related posts