telugu navyamedia
రాజకీయ

లక్ష్మణ్ దీక్షను విరమింపజేసిన కేంద్ర మంత్రి

lakshman hungerstrike
తెలంగాణ ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ  ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ శుక్రవారం తన నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ ఈ ఉదయం నిమ్స్ ఆసుపత్రికి వచ్చి లక్ష్మణ్‌కు  నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. లక్ష్మణ్ దీక్షను ప్రారంభించగా అదే రోజు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నిమ్స్ కు తరలించిన సంగతి తెలిసిందే. 
అయినప్పటికీ లక్ష్మణ్ నిమ్స్ లోనే తన దీక్షను కొనసాగించారు. వైద్య చికిత్సనూ నిరాకరించారు. కాగా, హన్సరాజ్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపీ దత్తాత్రేయ తదితరులు ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ, షుగర్  కూడ పడిపోయింది. బీజేపీ అగ్రనేతలు డాక్టర్ లక్ష్మణ్‌ను దీక్ష విరమింపజేసేలా ఒప్పించారు. 

Related posts