telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంఐఎంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఫైర్

BJP Kishan Reddy Says Threatening Calls

హైదరాబాద్‌ ప్రశాంతతను, మత సామరస్యాన్ని మజ్లీస్‌ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న అంబర్ పేట్ లో లేనిపోని సమస్యలను ఎంఐఎం సృష్టిస్తోందని ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం వల్లనే ఈ సమస్య తలెత్తిందన్నారు. తాను అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నారు.

అంబర్ పేటలో అక్కడ అసలు మసీదు లేదని, కానీ ఉన్నట్టుగా చూపే ప్రయత్నం ఎంఐఎం చేస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆ వివాదాస్పద స్థలాన్ని ఆ స్థలం యజమానులకు ప్రభుత్వం డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌తో దోస్తానీ చేస్తే ఏమైనా చెయ్యొచ్చా అని నిలదీశారు. దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related posts