telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉసురు ఊరికే పోదు: బీజేపీ నేత లక్ష్మణ్‌

BJPpresident -K-Laxman

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉసురు ఊరికే పోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం బీజేపీ సిద్ధిపేట జిల్లా కార్యాలయం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల ఉద్యమం సీఎం కేసీఆర్‌ పతనానికి నాంది పలుకుతుందని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్‌ అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలనకు తగిన గుణపాఠం చెప్పేది బీజేపీ పార్టీయేనని తెలిపారు. ఆర్టీసీ ఉద్యమం మంత్రుల కోసమో చైర్మన్ల కోసమో అమ్ముడుపోయే సరుకు కాదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని తెలిపారు.

Related posts