telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పౌరసత్వ సవరణ చట్టానికి మజ్లిస్ మతం రంగు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

కేంద్రం ఇటీవల అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి మజ్లిస్ పార్టీ మతం రంగు పులిమి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఈ రోజు ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిన్న హైదరాబాద్ లో జరిగిన ఎంఐఎం సభ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని మండిపడ్డారు. ప్రజల్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని ఎంఐఎం వంటి పార్టీలు ఎదురు చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో జాతీయవాద శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ ముందు ఇక్కడి ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్ లో ముస్లిం రాజ్యాంగం కొనసాగి, అక్కడి హిందువులపై దారుణాలు జరుగుతున్నా మనం పట్టించుకోకూడదని, ఇక్కడ మాత్రం ముస్లింలకు అన్ని విధాలా గౌరవం లభిస్తున్నా ప్రతి విషయంలోనూ మతం రంగు పులుముతారని ఆరోపించారు.

Related posts