telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ ఎదగడాన్ని టీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది: లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ ఎదగడాన్ని టీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని ఆ పార్టీ నేత డాక్టర్ కాశెట్టి లక్ష్మణ్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు నేతలుఈరోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని చెప్పారు. డోకూరులో బీజేపీ ఎంపీటీసీ గెలిస్తే అక్కడ ప్రేమ్ కుమార్ ను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయాన్ని కూలగొట్టి కొత్త భవనాన్ని నిర్మించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాడులు పరిపాటిగా మారిపోయాయని లక్ష్మణ్ అన్నారు. సెక్రటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తే రాజాసింగ్ ను, తమ ఎమ్మెల్సీ రామచందర్ రావును అరెస్ట్ చేశారని మండిపడ్డారు.రానున్న రోజుల్లో బీజేపీ లో భారీ చేరికలు ఉంటాయని లక్ష్మణ్ తెలిపారు.

Related posts