telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది: లక్ష్మణ్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శిచారు. శుక్రవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమకారులకు కాకుండా వందల కోట్లు ఉన్నవారికి మాత్రమే టీఆర్‌ఎస్‌ టిక్కెట్లు కేటాయించిందని ఆరోపించారు.

తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీలోకి వెళతారో తెలియని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో మరొకసారి మోదీ ప్రధాన మంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు వలసపోవడంతో కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీగా మారిందని తెలిపారు.

Related posts