telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్అన్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో పోటీకి బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసే విషయమై ఆ పార్టీ ముఖ్యనేతలు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ చర్యలతో తెలంగాణ ప్రజల ఓపిక నశిస్తోందనన్నారు. ప్రజల ఓపిక నశిస్తే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చునని జోస్యం చెప్పారు.

ఈ మధ్యకాలంలో కేసీఆర్ మాటలు చూస్తుంటే టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ బీజేపీనే అని అర్థం అవుతుందన్నారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అన్ని వర్గాల వారు బీజేపీ వైపు చూస్తున్నారని, ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అని ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీలో ఓనర్లు, బయటివాళ్ల మధ్య ఆధిపత్య పోరు ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను బెదిరిస్తోందని మండిపడ్డారు.

Related posts