telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

టీఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాశెట్టి లక్ష్మణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ వస్తే యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ ఫీజులు తెలంగాణ స్కూళ్లలోనే ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో చదువును కొనాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇంటర్నేషనల్, టెక్నో, ఒలింపియాడ్ తదితర పేర్లతో దోచుకుంటున్నారని మండిపడ్డారు.

కనీస అవగాహన కూడా లేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారని దుయ్యబట్టారు. 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే కేసీఆర్ కనీసం స్పందించలేదని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు కేసీఆర్ మాటలు విని మోసపోయారని అన్నారు. టీఆర్ఎస్ నేతల రక్షణ కోసమే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు.

Related posts