telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ విభజన బిల్లు పాస్ అయ్యేందుకు జైట్లీ కృషి: బీజేపీ నేత లక్ష్మణ్

BJPpresident -K-Laxman

రాజ్యసభలో తెలంగాణ విభజన బిల్లు పాస్ అయ్యేందుకు అరుణ్ జైట్లీ కృషి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో జైట్లీ చిత్రపటానికి లక్ష్మణ్, రాంమాధవ్, డీకే.అరుణ, దత్తాత్రేయ, వివేక్, రామచందర్ రావు, తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతో ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి ఉద్యమంలో జైట్లీ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పలు విలువైన సూచనలు, సలహాలు జైట్లీ ఇచ్చారని అన్నారు. దేశం ఒక గొప్ప నాయకుడ్ని కోల్పోయిందని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకూ పోరాడారని ప్రశంసించారు. జైట్లీ విద్యార్థి నాయకునిగా జీవితాన్ని ప్రారంభించారని తెలిపారు. జైట్లీ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Related posts