telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆరేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్మండిపడ్డారు. ఆరేళ్లలో ఒక్క గ్రూప్-1 నియామక ప్రకటన కూడా చేయలేదని ఆరోపించారు. కనీసం నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతిని కూడా ఇవ్వకుండా పక్కనబెట్టేశారని దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబీకులకు పదవులు లభిస్తున్నాయే తప్ప, రాష్ట్రంలోని యువతకు మాత్రం ఉద్యోగాలు లభించడంలేదని అన్నారు.

ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి వంతపాడుతూ ఉద్యోగులను వంచిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్ కు ఉద్యోగులు గుర్తొస్తారని అన్నారు. ఎన్నికలైపోయాక ఉద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ప్రతినెల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Related posts