telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొడుకు కోసమే కేసీఆర్ యాగాలు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా యజ్ఞయాగాదులు నిర్వహించడానికి కారణం కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేట వద్ద కృష్ణానదిలో మూసీ నది కలిసే చోటును లక్ష్మణ్ పార్టీ నేతలతో కలిసి లక్ష్మణ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ లో బాహుబలులు, కట్టప్పలు ఉన్నారని చెప్పుకుంటున్నారని, కానీ అలాంటి వారందరినీ తలదన్నే బ్రహ్మాస్త్రం ప్రధాని మోదీ వద్ద ఉందని అన్నారు. బ్రహ్మాస్త్రం ముందు మరే అస్త్రం పనిచెయ్యదని ఎద్దేవా చేశారు. మోదీ చేస్తున్న అభివృద్ధి అనేకమందిని ఆకట్టుకుంటోందని తెలిపారు.

Related posts