telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తండ్రీకొడుకులు ఇద్దరూ .. ఓట్లు ఎంతైనా కొనేస్తారు.. : బీజేపీ లక్ష్మణ్

bjp lakshman fire on kcr and ktr

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెరాస నేతలు దేశ భద్రతపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమ వలసదారులను అరికడతామంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ ద్రోహులను గుర్తించి పంపిస్తామంటే తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వేలాది మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని.. వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నారన్నారు. అలాంటి వారిని తప్పించాలిగానీ.. వారికి ఊరట కల్గించేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. కారు..సర్కారు.. తెరాస కావచ్చు.. కానీ హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. కర్రు కాల్చి వాతపెట్టినట్టు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

Related posts