telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పాతబస్తీలో కిషన్ రెడ్డి పర్యటన..ఫ్లెక్సీల తగలబెట్టడంతో ఉద్రిక్తత

Kishan Reddy bjp

హైదరాబాద్ పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు పర్యటించారు. పాతబస్తీలోని ఆసిఫ్ నగర్ లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న సమయంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. కిషన్ రెడ్డిని ఫ్లెక్సీలను ఓ యువకుడు తగలబెట్టాడు. దీంతో పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిషన్‌రెడ్డి ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకుడిని పట్టుకొని బీజేపీ శ్రేణులు చితకబాదాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

Related posts