telugu navyamedia
Uncategorized

కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు: కిషన్ రెడ్డి

Kishan Reddy

యూరియా కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేనందువల్లే యూరియా సమస్య తలెత్తిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే కేంద్రం 50 శాతం యూరియాను తెలంగాణకు పంపిందని చెప్పారు.

మరో 50 శాతం యూరియా రెండు రోజుల్లో చేరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక ఉంటే ఈ సమస్య తలెత్తేతి కాదని అన్నారు. రాష్ట్రం అడిగిన వెంటనే కేంద్రం యూరియాను పంపుతోందని చెప్పారు. రైతులు ఎవరూ యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Related posts