telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వెళ్లే పరిస్థితులు: కిషన్ రెడ్డి

BJP Kishan Reddy Says Threatening Calls

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి అన్నారు. .ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకత్వంపై నమ్మకం లేక ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని విమర్శించారు. పంటల బీమా పథకంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అకాలవర్షాలకు రైతులు నష్టపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

వచ్చే నెల 20,21 తేదీల్లో జిల్లా కార్యవర్గ సమావేశాలున్నాయని తెలిపారు.రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం సర్వరోగ నివారిణి కాదని అన్నారు. రైతు బంధు పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట బీమా పథకం కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకూ రైతులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts