telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ వార్త పత్రికలు ఒకే పార్టీకి భజన చేస్తున్నాయి: కన్నా

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొన్ని మీడియా సంస్థల పై మండిపడ్డారు. కొన్ని తెలుగు దిన పత్రికలు, చానెళ్లు ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “ప్రజలకు నిష్పక్షపాతంగా వార్తలు రాయాల్సిన బాధ్యత మరిచి చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని అబద్ధపు సమాచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పత్రికలు” అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగ్ ను కన్నా జత చేశారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని వకాల్తా పుచ్చుకుని చంద్రబాబు ఖాతాలో వేస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం అందించడంలో ఈ పత్రిక ఎల్లప్పుడూ ముందుంటుందని ఆరోపించారు.

Related posts