రాష్ట్రంలో ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించిందని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత వల్ల లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శలు గుప్పించారు. దీనికి కారణంప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు.
ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ సమస్యపై తాము మొదటి నుంచీ పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. ఇసుక కొరత సమస్యపై రేపు విజయవాడలో ధర్నా చేస్తామని కన్నా తెలిపారు.
వైఎస్ జగన్ అవినీతి రాజ్యానికి రాజు: ఎమ్మెల్సీ అశోక్ బాబు