telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి కేంద్రం నుంచి సహకారం: కన్నా

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అన్నిరకాలుగా సహకారం ఉంటుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెద్ద వ్యాపారస్తుల నుంచి చిరు వ్యాపారుల వరకూ అందరకూ మోదీ ఐదేళ్ల పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ చరిష్మాతోనే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించిందన్నారు. దేశంలో పెద్దపెద్ద మోదీ ఉంటేనే భారత్ ఇండియాలా ఉంటుందనీ, లేదంటే పాకిస్థాన్ అయిపోతుందన్నారు. 

ఏపీలో జగన్ అధికారంలోకి వస్తాడని తాను ముందే చెప్పానని తెలిపారు. ఏపీలో 130కి పైగా సీట్లు జగన్ కు ఈసారి రావచ్చు అని చెప్పినట్లు గుర్తుచేశారు. టీడీపీ అరాచకాలను మౌనంగా భరించిన ప్రజలు గుట్టుచప్పుడు కాకుండా సమాధానం చెప్పారు. ఏపీకి వచ్చిన సొమ్మంతా గత ప్రభుత్వం దాచేయడం వల్లే పెద్దనోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నగదుకు కరవు ఏర్పడిందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు తాను 100 ప్రశ్నలు సంధిస్తే ఒక్కదానికి జవాబు ఇవ్వలేదన్నారు.

Related posts