ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్రం స్పష్టతనిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా మ్యాప్ లో అమరావతిని కూడా చూపారని వెల్లడించారు. సీఎం జగన్ కూడా అమరావతి నిర్మాణంపై వెంటనే దృష్టి సారించారని చెప్పారు.
అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు మంత్రులకు, అధికారులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్టంలో పార్టీ పరిస్థితిపైనా కన్నా స్పందించారు. వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీజేపీ ప్రబలశక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.