telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు నిర్ణయంతోనైనా ఏపీ సర్కారు మేల్కొనాలి: కన్నా

Kanna laxminarayana

హైకోర్టు నిర్ణయంతోనైనా రాష్ట్ర సర్కారు ఏపీ మేల్కొనాలని రాష్ట్ర జేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల వ్యవహార శైలిని హైకోర్టు కూడా తప్పుబట్టిందని ఏపీ బీపేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. మాస్కులు కావాలని అడిగిన డాక్టర్ సుధాకర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమని కన్నా వ్యాఖ్యానించారు.

హైకోర్టు తీర్పును చూసైనా ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. డాక్టర్ వ్యవహారంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వ్యక్తులపై ఇలాంటి చర్యలు సబబు కాదని కన్నా హితవు పలికారు.

Related posts