ఏపీ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి పథకానికి దేవాదాయ శాఖ నిధులు మళ్లించారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనిఅన్నారు. ఈ వ్యవహారం పై సీఎం జగన్ కు కన్నా లేఖ రాశారు.
దేవాదాయశాఖ నిధులను కేవలం హిందు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని అన్నారు. ఇకపై దేవాదాయశాఖ నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను వెంటనే దేవాదాయశాఖ ఖాతాలోకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.