telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

ఏపీపై బీజేపీ కన్ను.. రంగంలోకి చిరంజీవి..

chiranjeevi meghastar

ఏపీలో పట్టుకోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తామే ప్రధాన పార్టీగా ఎదుగుతామని స్పష్టం చేస్తుంది. అదే లక్ష్యంగా, ఉన్న అవకాశాలను జల్లెడపడుతుంది. అప్పుడు బీజేపీకి కనిపించిన అస్త్రం మెగాస్టార్ చిరంజీవి. ఆయనను తమవైపు తిప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది బీజేపీ అధిష్టానం. ఈ అస్త్రంతో ఏపీని క్లీన్ స్వీప్ చేయొచ్చని భావిస్తున్నప్పటికీ, ఇతర అడ్డంకులను సమూలంగా అడ్డుతొలగించుకొనే ప్రయత్నాలు మరోవైపు చేస్తూనే ఉంది బీజేపీ. అది టీడీపీని కనుమరుగు చేయడం కావచ్చు.. ఇతర ప్రాంతీయ పార్టీలను బీజేపీ విలీనం దిశగా అడుగులు వేయడం కావచ్చు.. ఏది ఏమైనా ఏపీపై బీజేపీ గట్టిపట్టుదలతోనే ఉంది. దీనితో ఏపీ రాజకీయాలలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్టు రాజకీయ విశ్లేషకులు కూడా బలంగా చెప్తుండటం, బీజేపీ వ్యూహానికి బలం చేకూరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి బీజేపీకిలోకి భారీగా చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి ఉన్నతమైన విలువలు, ప్రజాభిమానం ఉన్న వ్యక్తి బీజేపీలోకి చేరితే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాభిమానం ఉన్న నటుడిగా చిరంజీవి గుర్తింపు పొందారని ప్రశంసించారు. ప్రస్తుతం యువనాయకత్వం బీజేపీ వైపు చూస్తోందని చెప్పారు. 2024 నాటికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా 150 మంది నేతలు తెరమరుగు అయిపోతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related posts