telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రత్యేక హోదాపై రాజకీయాలు చేయొద్దు: జీవీఎల్

gvl comments on tdp

ప్రత్యేక హోదాపై రాజకీయాలు చేయొద్దని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీకి హితవు పలికారు. హోదాపై రాజకీయాలు చేయాలని చూస్తే, గత సర్కారుకి ఎదురైన పరిస్థితే వైసీపీకి కూడా ఎదురవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన మంత్రి మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖపై జీవీఎల్ ఘాటుగా స్పందించారు. హోదాకు బదులు పథకాలు, ప్రాజెక్టుల ద్వారా ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్ల నిధులు ఇచ్చిందని జీవీఎల్ చెప్పారు.

ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని వివరించారు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కొత్త జీవో తెస్తే కేంద్రం నోటిఫై చేస్తుందని చెప్పారు. రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం కాదని అన్నారు. అయితే, రాజధానిగా అమరావతిని మార్చడం సరికాదని బీజేపీ రాజకీయ తీర్మానం చేసిందని వివరించారు.

Related posts