తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతల గొంతు కోస్తున్నారని ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు. కవిత, కేటీఆర్తో కల్వకుంట్ల రాజ్యం విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ కోసం మొదటి నుంచి హరీశ్ రావు, ఈటల రాజేందర్ పోరాడారని… అలాంటి వారిని కూడా కేసీఆర్ గెంటేశారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు.పెద్దపల్లి జిల్లాకు నీళ్లు ఇచ్చిన తర్వాతే… ఇతర ప్రాంతాలకు కాళేశ్వరం నీటిని తరలించాలని వివేక్ డిమాండ్ చేశారు.