telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థి ఖరారు

BJP candidate huzurnagar

తెలంగాణలో హుజూర్‌నగర్ అసెంబ్లీకీ వచ్చే నెల 21న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ నుంచి శానం పూడి సైదిరెడ్డిని, కాంగ్రెస్‌ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. తాజాగా బీజేపీ హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కోట రామారావును బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక చేసింది.

టికెట్‌ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కోటా అప్పిరెడ్డి ఉండగా చివరకు రామారావుకు టికెట్‌ దక్కింది. మొదట శ్రీకళా రెడ్డికి టికెట్ ఖరారు అవ్వగా కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోటీ నుండి తప్పుకున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి శానం పూడి సైదిరెడ్డిని, కాంగ్రెస్‌ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లకు ఈనెల 30 వరకూ గడువు ఉంది. అక్టోబరు 21న పోలింగ్‌ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.

Related posts