telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి: బండారు దత్తాత్రేయ

BANDARU DATTATREYA

తెలంగాణ సర్కారు పై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి చెలరేగిపోతోందని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం సక్రమంగా వినియోగించడంలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఉన్న శ్రద్ధ… ప్రజలపై లేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేదని ఆయన అన్నారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచనదినంగా ప్రభుత్వం ప్రకటించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

Related posts