telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ గోడ మీద పిల్లి.. చంద్రబాబు అవకాశవాది: దత్తాత్రేయ

BJP Dattatreya comments Jagan

తెలుగు రాష్ట్రాల సీఎంలపై బీజేపీ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడు, చంద్రబాబు అవకాశవాదని తీవ్రమైన ఆరోపణ చేశారు. ఫెడరల్, మహాకూటములు తమ దరిదాపుల్లో లేవని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆరు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీనిచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై కేసీఆర్ సర్కార్‌ సవితితల్లి ప్రేమ చూపిస్తోందని అన్నారు.

కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 80 వేల కోట్లకు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఇంటర్‌ బోర్డు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చినా గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని దత్తాత్రేయ ప్రశ్నించారు.

Related posts