ఏపీలో కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీహాజరై పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు.
సీఎం జగన్ నెల రోజుల పాలనపై చర్చించిన బీజేపీ కోర్ కమిటీ అమ్మఒడి పథకం, ప్రజా వేదిక కూల్చివేత అంశాల్లో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించిందని అభిప్రాయపడింది. 40 లక్షల సభ్యత్వాల నమోదును లక్ష్యంగా పెట్టుకోవాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ముందుగా ప్రజల్లో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న అపోహను ప్రజల్లో తొలగించాలని నేతలు సూచించారు. టీడీపీ, జనసేన నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని కోర్ కమిటీ నిర్ణయించింది.