telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆసుపత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జ్

TDP Mla anitha comments Roja YCP

బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆదివారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని ఓయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకోవడంతో అమిత్ షాను నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆస్పత్రి నుంచి నేరుగా అమిత్‌ షా తన నివాసానికి చేరుకున్నారని బీజేపీ నేత అనిల్‌ బలూనీ వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ సోకిన అమిత్‌ షాకు ఎయిమ్స్‌ డైరెర్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులెరియా పర్యవేక్షణలో చికిత్స అందించారు.

కాగా తాను స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని, భగవంతుడి దయ, మీ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.అమిత్ షా అస్వస్థతకు గురైన కారణంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దైంది. ఆయనకు బదులుగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించారు.

Related posts