telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో మరో బీజేపీ నేత .. అదృశ్యం .. ఏ గూటికో.. !!

బీజేపీకి ఏపీలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పోటీ రసవత్తరంగా మారుతోంది. ఉపసంహరణకు చివరి రోజున కొన్ని పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు తమ నామినేషన్లు ఉపసంహరించుకుని ఆ పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో ఆ పార్టీ రెబల్స్‌గా బరిలోకి దిగినవారు దాదాపుగా తప్పుకున్నారు.

కడప జిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డి విషయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఒక్కసారిగా పార్టీకి షాకిచ్చారు. నామినేషన్ ఉపసంహరించుకున్న మహేశ్వరరెడ్డి, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఏం జరిగిందో తెలియక బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Related posts