telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్ లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ…

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే కనిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం తనకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకున్న బిజెపి ఇప్పుడు దగ్గరదగ్గరగా టీఆర్ఎస్ కు చేరువ అయింది. ఇప్పటికే బీజేపీ 46 స్థానాలు సాధించింది. మరొక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీ 53 స్థానాలు సాధించగా ఎంఐఎం పార్టీ 41 స్థానాల్లో ఉంది. ఇక భారీ ఎత్తున సీట్లు లభించడంతో బిజెపి పార్టీ ఆఫీస్ వద్ద సంబరాలు జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు అందరూ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. ఇప్పటి దాకా టిఆర్ఎస్ భవన్ వద్ద నెలకొన్న కోలాహలం అంతా బీజేపీ ఆఫీస్ కి చేరుకుంది. ప్రస్తుతానికి ఆఫీస్ వద్దకు చేరుకున్న బండి సంజయ్ ని కార్యకర్తలు భుజాల మీద ఉరేగిస్తూ లోపలికి తీసుకు వెళుతున్నారు. ఇప్పటివరకు 142 డివిజన్లో ఫలితాలు వెలువడగా అందులో 54 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నలభై ఆరు సీట్లు బిజెపి కైవసం చేసుకుంది 42 స్థానాలకు ఎం ఐ ఎం పరిమితం అయింది. ఇక కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలు మాత్రమే పరిమితమైంది.

Related posts