telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ తీరుతో తెలంగాణ తలదించుకునే పరిస్థితి: బండి సంజయ్

bandi samjay mp

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సీఏఏపై వ్యతిరేక తీర్మానం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ తీర్మానం చెత్తబుట్టకే పరిమితమవుతుందని అన్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ముస్లింల ఓట్ల కోసమే ఈ తీర్మానం చేశారని ధ్వజమెత్తారు.

జాతీయ జనాభా రిజిష్టర్ (ఎన్పీఆర్) లో పేర్లు నమోదు చేసుకోకుంటే కేసీఆర్, ఒవైసీలు పాకిస్థాన్ కు శరణార్థులుగా వెళ్లాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్పీఆర్ లో కనుక వారి పేర్లు నమోదు చేసుకోకుంటే కేసీఆర్, ఒవైసీకి ఓట్లు లేనట్టేనని హెచ్చరించారు.సీఏఏతో దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని మరోసారి స్పష్టం చేశారు. ముస్లింలు వేరే దేశం నుంచి మన దేశానికి వస్తే కనుక ఇక్కడి ముస్లింల పొట్టకొట్టే ప్రయత్నం చేసినట్టే అవుతుందన్నారు.

Related posts