telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆరోగ్యశాఖ తప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోంది: బండి సంజయ్

BJP Bandi sanjay

కరోనా కేసుల విషయంలో ఆరోగ్యశాఖ తప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. జిల్లాల్లో కరోనా కేసుల పూర్తి వివరాలు చెప్పకపోవడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతోందని అన్నారు. ఘోరమైన పరిస్థితిలో రాష్ట్రముంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హైకోర్టును దిక్కరించే పరిస్థితి రావటం దారుణమని బండి సంజయ్ అన్నారు.

ప్రజల ప్రాణాలపై హైకోర్టు ప్రశ్నించినా సీఎం స్పందించకపోవటం అన్యాయమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. సమస్య చిన్నదిగా చూపించి సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రజల బాగోగులు చూడటానికే ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఎంపీ సూచించారు. ఫాంహౌస్, ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలని డిమాండ్ చేశారు.

Related posts