telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అరుణ్‌ జైట్లీ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం

jagan attending guntur iftar tomorrow

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారని, విలువలకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు.

జైట్లీ ఆత్మకి శాంతి కలగాలి : గవర్నర్‌ బిశ్వభూషణ్

కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు అరుణ్‌ జైట్లీ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సంతాపం తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ జైట్లీ కన్నుమూయడంపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలన్నారు.

జైట్లీ మరణం చాల బాధ కలిగించింది: పవన్ కల్యాణ్

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ రోజు అరుణ్ జైట్లీ మరణించడం చాలా బాధ కలిగించిందన్నారు. ఆయన న్యాయవాదిగానే కాకుండా, ఆర్థికమంత్రిగా, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అప్పటి పరిస్థితులను ఎదుర్కొన్న విధానం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో మగ్గిన వైనం ఆయన స్థైర్యానికి నిదర్శనం అని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related posts