telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్తాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పింది: అమిత్ షా

TDP Mla anitha comments Roja YCP

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో పాకిస్తాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధిచెప్పిందని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా అన్నారు. ఇకపై భారత్-పాక్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎలా ఉండాలనేది పాకిస్తాన్‌ తేల్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ఓ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌కు భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ ఘటన పై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలని అన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడితో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయన్నారు. పాక్‌ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు భారత్‌ వాయు సేన వైమానిక దాడులు చేపట్టిందన్నారు. మన దేశంలోకి చొచ్చుకువచ్చిన పాక్‌ యుద్ధవిమానాలను భారత్‌ సమర్ధంగా తిప్పికొట్టిందని షా పేర్కొన్నారు.

Related posts