కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న కేడీ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం షా సొంత రాష్ట్రం గుజరాత్ కు వచ్చారు. అనంతరం నిన్న సాయంత్రం కుటుంబంతో గడిపారు. ఈరోజు తిరిగి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు.
అయితే అమిత్ షా ఏ ఆరోగ్య కారణంతో ఆసుపత్రిలో చేరారన్న విషయమై ఇటు కుటుంబ సభ్యులు, అటు ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఓ చిన్న సర్జరీ కోసం షా కేడీ ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈరోజు సాయంత్రం షా డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దే: రేవంత్ రెడ్డి