బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ చుట్టూ తిరిగేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కృషి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల కోసం చేసుంటే ఆయనకు మరికొన్ని సీట్లైనా దక్కేవని అమిత్ షా ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజాయాన్ని సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగిన విజయోత్సవ సభలో షా మాట్లాడారు.
ఈ సందర్భంగా విపక్షపార్టీలను ప్రస్తావిస్తూ మరీ ముఖ్యంగా చంద్రబాబుకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నానని అంటూ పై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ తరపున అమిత్ షా అభినందనలు తెలిపారు.