telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వామన్‌రావు హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్ట్…

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న బిట్టు శ్రీనును అరెస్ట్ చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్‌ ప్రకటించింది… ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఐజీ నాగిరెడ్డి.. పాశవికంగా చంపబడిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీరియస్ గా తీసుకున్నట్టు తెలిపారు.. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్నా… వారు ఎవరినైనా, ఎంతటివారినైనా వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.. హత్య కుట్రలో నిందితులకు కారు మరియు రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీనును అరెస్ట్ చేశామని.. వామన్ రావు, ఆయన భార్య నాగమణి ఇద్దరిని చంపామని కుంట శ్రీను.. బిట్టు శ్రీనుకి ఫోన్లో సమాచారం ఇచ్చారని వెల్లడించారు.. ఇక, నిందితులను మహారాష్ట్రకు వెళ్లిపోవాలని చెప్పింది కూడా బిట్టు శ్రీనుగా తెలిపారు పోలీసులు.. అంతా చేసి.. హత్య తర్వాత ఏమి తెలియనట్లు ఇంటి వద్దే ఉన్నాడని పేర్కొన్నారు.. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు వెల్లడించారు ఐజీ నాగిరెడ్డి. చూడాలి వారి ఈ కేసును ఎప్పటివరకు పోలీసులు పూర్తి చేస్తారు అనేది.

Related posts